రిలయన్స్ జియో అందరికీ ఫ్రీ.!
- ♦ 4జీ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు
- ♦ ఓపెన్ మార్కెట్లో ప్రివ్యూ ఆఫర్
- ♦ 90 రోజులపాటు అన్లిమిటెడ్
- ♦ టెలికం రంగంలో జియో సంచలనం
మీదగ్గర 4జీ స్మార్ట్ఫోన్ ఉందా? ఇంకేం ఎంచక్కా 90 రోజులపాటు అన్లిమిటెడ్ డేటా, కాల్స్ ఎంజాయ్ చేయండి. అదీ ఉచితంగా. నమ్మశక్యంగా లేదు కదూ. టెలికం మార్కెట్లో పెను సంచలనానికి రిలయన్స్ జియో తెరతీసింది.
ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన జియో ప్రివ్యూ ఆఫర్ ఇక నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది.
4జీ స్మార్ట్ఫోన్ ఉన్న కస్టమర్లు ఎవరైనా జియో సిమ్ను ఉచితంగా తీసుకోవచ్చు. 90 రోజులపాటు అపరిమితంగా జియో సేవలను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో వాణిజ్యపర కార్యకలాపాలను ఇంకా ప్రకటించక ముందే తీసుకున్న తాజా నిర్ణయం టెలికం మార్కెట్ను షేక్ చేయనుంది.
రిలయన్స్ జియో ఆరు నెలల క్రితం ప్రివ్యూ ఆఫర్ను ప్రారంభించింది. దీని కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు దీనిని అమలు చేసింది. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు కార్పొరేట్ కంపెనీలను జియో సంప్రదించింది.
ఈ కంపెనీల ఉద్యోగులకు ఇప్పటి వరకు ఏ టెలికం సంస్థా ఇవ్వనటువంటి అత్యుత్తమ సీయూజీ ప్యాక్ను ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అలాగే లైఫ్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్ను అమలు చేస్తోంది. దీనినిశామ్సంగ్, హెచ్పీ వినియోగదారకు విస్తరించింది.
తాజాగా 4జీ స్మార్ట్ఫోన్ ఏ కంపెనీదైనా సరే. ప్రతి ఒక్క కస్టమర్కు ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.
కస్టమర్లు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా అధీకృత స్టోర్ను సంప్రదించి ఉచిత సిమ్ను పొందవచ్చు.